ఆ ఈవీఎంలను మార్చాం : సీఈఓ ద్వివేది

ఆ ఈవీఎంలను మార్చాం : సీఈఓ ద్వివేది
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఎన్నికల సంఘం ద్వివేది స్పష్టం...

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఎన్నికల సంఘం ద్వివేది స్పష్టం చేశారు.పోలింగ్‌కు సంబంధించిన దుష్ప్రచారాలు వస్తున్నాయి వీటిని నమ్మొద్దని ఆయన కోరారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలను సాంకేతిక సిబ్బంది పరిష్కరించారని తెలిపారు. సక్రమంగా కనెక్షన్లు ఇవ్వకపోవడంవల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు.

కేవలం 362 ఈవీఎంలలోనే స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లోపాలు తలెత్తిన 310 ఈవీఎంలను అధికారులు అప్పటికప్పుడు సరిచేశారు. 52 చోట్ల సాంకేతికంగా సమస్యలు తలెత్తిన ఈవీఎంలను మార్చామని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories