'అక్కడ లోకేష్‌ పోటీ చేసినా వైఎస్సార్‌సీపీదే గెలుపు'

అక్కడ లోకేష్‌ పోటీ చేసినా వైఎస్సార్‌సీపీదే గెలుపు
x
Highlights

భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్‌ పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఎవరు పోటీ చేసినా...

భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్‌ పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుపు నాదే అంటున్నారు అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని జగన్‌ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు..

లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో గెలుస్తాను. టీడీపీ అంటే ఒక రాచరిక పాలన అని ప్రజలనుకుంటున్నారు , ఐదేళ్లు గుర్తుకు రాని ప్రజలు ఇప్పుడు ఉన్నపళంగా ఎలా గుర్తుకువచ్చారు' అని ప్రశ్నించారు. కాగా ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి అవంతి శ్రీనివాసరావు బరిలో నిలవనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories