స్థానిక ఎన్నికల ఎఫెక్ట్.. కీలక పథకం వాయిదావేసిన జగన్ సర్కార్

స్థానిక ఎన్నికల ఎఫెక్ట్.. కీలక పథకం వాయిదావేసిన జగన్ సర్కార్
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన రేషన్ డోర్ డెలివరీ పథకం మరోసారి వాయిదా పడింది

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన రేషన్ డోర్ డెలివరీ పథకం మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 1న ప్రారంభం కావాల్సిన ఈ పథకం పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రద్దైంది. అనంతపురం జిల్లా కదిరిలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించాలి. అయితే ఈ కార్యక్రమాన్ని కూడా అధికారులు రద్దు చేశారు. ఏడాది నుంచి ఈ కార్యక్రమానికి ఏదీ కలిసిరావడం లేదు. బియ్యం కార్డుల మంజూరులో ఆలస్యం, కరోనా లాక్ డౌన్, ఆ తర్వత కొత్తకార్డుల మంజూరు వంటి పనులు ఆలస్యం కావడంతో పథకం ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి కొత్తపథకాలు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి గండిపడినట్లైంది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ కోసం 9260 వాహనాలను ఈనెల 21న ప్రారంభించింది. ఈ వాహనాలను వాహనాలను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలకు ప్రభుత్వం కేటాయించింది.

ఇందులో బీసీలకు 3875, ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో వాహనాల అందించింది. ఇప్పటికే వాహనాలన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు చేరుకున్నాయి. పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధతత నెలకొన్న నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఈ పథకాన్ని వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నాలుగు విడతల్లో జరగనున్నాయి. ఎన్నికలు అయిపోయాక ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత రావాల్సివుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories