సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం.. 8 మంది సజీవదహనం

8 Feared Dead in Road Mishap in  Sri Sathya Sai District
x

సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం.. 8 మంది సజీవదహనం

Highlights

*మృతులు గుడ్డంపల్లికి చెందిన వారిగా గుర్తింపు

Andhra Pradesh: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. ఆటోపై విద్యుత్‌ తీగలు తెగిపడడంతో 8 మంది సజీవ దహనమయ్యారు. చిల్లకొండయ్యపల్లిలో ఉదయం వ్యవసాయ పనుల కోసం 8 మంది ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. కరెంట్‌ తీగలు తెగిపడిపోయాయి. దీంతో, ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆటోలో వెళ్తున్న 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతులు గుడ్డంపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories